News

Title

joel sutherland

Monday 25 January 2016

మాస్ మహారాజ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు




Ravi-Teja-B-datమాస్ మహారాజ రవితేజ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు 90వ దశకంలో సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన రవితేజ ఈరోజు ఇండస్ట్రీ లో పేరొందిన హీరోలలో ఒకరు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. “ఇడియట్” మరియు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” వంటి చిత్రాలతో పూరి జగన్నాథ్ రవితేజ కెరీర్ కి బాగా సహాయపడ్డారు. “వెంకి”,”విక్రమార్కుడు” మరియు “దుబాయ్ శీను” వంటి చిత్రాలతో మాస్ లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చిపెట్టుకున్నారు. తరువాత కొద్దిగా వెనకబడినా సురేందర్ రెడ్డి “కిక్” చిత్రంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు.   ప్ర‌స్తు‌తం ఆయ‌న ఎవ‌డో ఒక్క‌డు చిత్రం తెర‌కెక్కు‌తుతుంది. ఈ చిత్రం  పై ఆశ‌లు ఎక్కు‌వ పెట్టు‌కున్నా‌రు.



 








Thursday 21 January 2016

రవితేజ తో మరోసారి...ఢీ

 రవితేజ కథానాయకుడుగా దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ‘ఎవడో ఒక్కడు’ సినిమాకు వేణు శ్రీరామ్ దర్సకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. ప్రకాష్ రాజ్, నాజర్ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దసరా రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ సినిమా షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్. యూత్‌ని బేస్ చేసుకొని తీస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Saturday 16 January 2016

ప్రాణం తీయబోయిన ''పతంగి''

హైదరాబాద్ : పతంగి కోసం సాహాసం చేసి ఓ యువకుడు రెండో అంతస్తు విద్యుత్ తీగల మీద నుండి కింద పడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

Wednesday 28 October 2015

మెదడు లేకుండా పుట్టిన శిశువు

http://www.navatelangana.com/mm/20151028//1446068503with%20out%20brain.jpg- రెండేండ్ల వయసులో 'అమ్మా' అని పిలుపు
లనార్క్‌షాయర్‌(స్కాట్లాండ్‌): అమ్మా అనే పిలుపు వినడం ఏ మహిళ జీవితంలోనైనా అపురూప మైనదే. ఆ బుడతడు రెండేండ్ల వయసులో 'అమ్మా' అని పిలిచాడు. మెదడు లేకుండా పుట్టిన తన కొడుకు కొన్ని నిమిషాలు కూడా బతుకుతాడో లేదో అనుకుంటే రెండేండ్ల వయసుకు చేరుకున్నాడు. తల్లిని గుర్తుపట్టి 'అమ్మా' అని పిలిచాడు. మరి సంతోషంగా ఉండదా ఎమ్మాకు. స్కాట్‌లాండ్‌లోని లనార్క్‌షాయర్‌లో నివసించే ఎమ్మా 2013 మార్చి నెలలో ఓ రోజు కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లింది. భరించలేని ఆ నొప్పి అపెండిసైటిస్‌ కావచ్చు అనుకుంది ఎమ్మా.

అజాత శత్రువుగా...

నాగబాబు.. అభిరుచి గల నిర్మాతగా, నటుడిగా అన్నింటికంటే మంచి మనసున్న వ్యక్తిగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చవిచూసినా ధైర్యంగా నిలబడి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. సినిమాల్లోని ముఖ్యపాత్రల్లోనే కాకుండా సీరియల్స్‌, 'జబర్దస్త్‌' కామెడీ షోతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాగబాబు పుట్టినరోజు నేడు (గురువారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన గురించి 'నవచిత్రం'పాఠకులకు ప్రత్యేకం..

Tuesday 27 October 2015

రియల్‌ గ్యాంగ్‌స్టర్స్‌...



రెహ్మాన్‌కు హృదయనాథ్‌ అవార్డు

ఎవ్వరైనా ట్రెండ్‌ని ఫాలో అవ్వాల్సిందే...



'నా సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశాను. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించినప్పటికీ ఇటీవల వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తూ మళ్ళీ జోరు పెంచబోతున్నాను' అని ఎం.ఎస్‌.రాజు తెలిపారు. ఆయన స్థాపించిన 'సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌' ఈ నెలతో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇండిస్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న ఎం.ఎస్‌.రాజు ఇటీవల తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించిన 'కొలంబస్‌' చిత్రానికి కథ, కథనం అందించారు. ఈ చిత్ర విజయంతో ఫామ్‌లోకి వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు 'నవచిత్రం' పాఠకుల కోసం..

Sunday 25 October 2015

అబ్బుర పరిచే డిటెక్ట్టివ్‌ చిత్రాలు

ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా ప్రారంభం

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమంతో ఆదివారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టగా, ఆయన తనయుడు మాస్టర్‌ అభరురామ్‌తో కెమెరా స్విచాన్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ,' క్లాస్‌,మాస్‌ అంశాలను ఆయన బ్యాలెన్స్‌ చేసే తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆయన అందించిన కథ నాకెంతో బాగా నచ్చింది.

డాలీ దర్శకత్వంలో వెంకీ?


Saturday 24 October 2015

కమల్‌ సరసన మిల్కీ బ్యూ‌టీ..!!

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఓ సూపర్‌ లక్కీ ఛాన్స్‌ని కొట్టేసింది. ఏకంగా కమల్‌హాసన్‌ సరసన నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. త్రిష తర్వాత ఈ తరహా అవకాశాన్ని దక్కించుకుంది తమన్నానే అని అందరూ అంటున్నారు. కమల్‌హాసన్‌ ప్రస్తుతం 'చీకటి రాజ్యం' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో కమల్‌ సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. 

బిగ్‌బి ఫేస్‌బుక్‌ రికార్డ్‌

రోజు రోజుకి బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌కి అభిమానగణం పెరిగిపోతుందటానికి ప్రత్యక్ష ఉదాహారణ ఆయన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో 22 మిలియన్ల అభిమానులు చేరడం. 'ఇంతటి ఘనతకు కారణమైన అభిమాను లందరికీ ధన్యవాదాలు' అని బిగ్‌బి అమితాబ్‌ స్పందించారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, బ్లాగ్స్‌ ద్వారా అభిప్రాయాలను, అనుభవాలను అమితాబ్‌ అభిమానులతో నిరంతరంగా పంచుకుంటారనే విషయం విదితమే.

Friday 23 October 2015

ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ప్రభాస్‌.. అభిమానులే కాదు.. ప్రేక్షకులు, సినీ వర్గాలు సైతం 'డార్లింగ్‌' అని ముద్దుగా పిలుచుకునే స్టార్‌ హీరో. ఎంత ఎదిగినా ఒదిగే గుణంతోపాటు అందరితో అప్యాయంగా మెలగడమే అందరికీ 'డార్లింగ్‌' అయ్యేలా ప్రభాస్‌ని చేసిందటనంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. జీవితంలో స్నేహబంధానికి ప్రభాస్‌ ఏ స్థాయి విలువనిస్తారని చెప్పడానికి అనేక సందర్భాలున్నాయి.

రవితేజ 'ఎవడో ఒకడు' ప్రారంభం

Wednesday 21 October 2015

డ్యాన్స్ తో అదరగొడుతున్న తమన్నా...

 సినీ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో రౌండ్ తిప్పిన తమన్నా..ఇప్పుడు తన అంద చందాలతో ప్రేక్షకుల మదిని కుల్లగొడుతుంది. ఈ మిల్కీ బ్యూటీ డాన్స్ తో మరోసారి ''బెంగాల్ టైగర్'' లో అలరించినున్న విషయం తెలిసిందే....

'నాన్నకు ప్రేమతో' టీజర్ విడుదల (వీడియో)

ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ సినిమా టీజర్‌ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు.

రవితేజ ‘బెంగాల్ టైగర్’ ట్రైలర్ అదరగొడుతోంది :Bengal Tiger Posters

 మాస్ మహరాజ రవితేజ ఎన‌ర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్‌టైగ‌ర్‌. సంపత్ నంది ద‌ర్శ‌కుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచివున్న నిర్మాణ‌సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మాత‌.
wach on see more...https://www.youtube.com/watch?v=GCvipxfEnJY




Monday 28 September 2015

''బ్రూస్‌లీ''లో మెగాస్టార్ స్పెషల్‌ ఎపియరన్స్‌

నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్

నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్  రవితేజ కథానాయకుడిగా  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ 17న ఆడియోను  రిలీజ్ చేసి,నవంబర్ 5న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటనలో తెలిపారు.   దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..