News

Title

joel sutherland

Sunday 25 October 2015

ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా ప్రారంభం

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమంతో ఆదివారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టగా, ఆయన తనయుడు మాస్టర్‌ అభరురామ్‌తో కెమెరా స్విచాన్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ,' క్లాస్‌,మాస్‌ అంశాలను ఆయన బ్యాలెన్స్‌ చేసే తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆయన అందించిన కథ నాకెంతో బాగా నచ్చింది.
మైత్రీ మూవీస్‌ సంస్థతో పని చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'ఎన్టీఆర్‌లో ఉన్న నటుడికి, ఆయన మాస్‌ ఇమేజ్‌కి సరిపడే కథ ఇది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. అలాగే ఓ ముఖ్యపాత్రలో ప్రముఖ నటుడు నటించబోతున్నారు' అని దర్శకుడు చెప్పారు. 'మా బ్యానర్‌లో రెండవ చిత్రంగా ఎన్టీఆర్‌గారితో చేయడం, 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో మళ్ళీ పని చేయడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్‌ను ప్రారంభించి, ఆగస్ట్‌ 12 కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని నిర్మాతలు : నవీన్‌ యేర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం) తెలిపారు.


No comments: