'నా సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూశాను. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించినప్పటికీ ఇటీవల వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేస్తూ మళ్ళీ జోరు పెంచబోతున్నాను' అని ఎం.ఎస్‌.రాజు తెలిపారు. ఆయన స్థాపించిన 'సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌' ఈ నెలతో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇండిస్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న ఎం.ఎస్‌.రాజు ఇటీవల తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించిన 'కొలంబస్‌' చిత్రానికి కథ, కథనం అందించారు. ఈ చిత్ర విజయంతో ఫామ్‌లోకి వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు 'నవచిత్రం' పాఠకుల కోసం..
అగ్రస్థాయికి ఎదిగారు..